బిహార్లో ఘోరం: అర్ధరాత్రి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. రోగులను వదిలేసి పారిపోయిన సిబ్బంది!
- ముజఫర్పూర్ ప్రసాద్ ఆసుపత్రిలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం
- ఐసీయూను కమ్మేసిన దట్టమైన పొగ.. ఊపిరాడక ముగ్గురు రోగుల మృతి
- ప్రమాదం జరగగానే రోగులను గాలికొదిలేసి పారిపోయిన ఆసుపత్రి సిబ్బంది
- 20 మందికి పైగా రోగులకు గాయాలు.. పలువురి పరిస్థితి విషమం
దేశ రాజధాని ఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్ ప్రమాదం మరవకముందే, బిహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో మరో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి ప్రసాద్ హాస్పిటల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఐసీయూ (ICU) విభాగం దట్టమైన పొగతో నిండిపోయింది. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే రోగులను కాపాడాల్సిన ఆసుపత్రి సిబ్బంది, మేనేజ్మెంట్ బాధ్యతారాహిత్యంగా వారిని గాలికొదిలేసి అక్కడి నుండి పారిపోయారు. ఐసీయూలో చిక్కుకుపోయిన రోగులు ఊపిరాడక, దట్టమైన పొగలో నరకయాతన అనుభవించారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఫైర్ ఆఫీసర్ ఆర్.ఎన్.పాండే తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదంపై సమాచారం అందింది. ఫైర్ ఫైటర్లు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికే ఐసీయూ మొత్తం దట్టమైన పొగతో నిండిపోయిందని, రెస్క్యూ టీమ్లు వచ్చేసరికి ఆసుపత్రి ఉద్యోగులు ఎవరూ అక్కడ లేరని ఆయన తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో 20 మందికి పైగా రోగులు గాయపడగా, వారిని అత్యవసరంగా భవనం నుంచి బయటకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘోర ప్రమాదం తర్వాత బాధితుల బంధువులు ఆసుపత్రి పరిపాలనా విభాగంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఐసీయూలో అడ్మిట్ అయిన తన తండ్రి ఈ ప్రమాదంలోనే చనిపోయాడని, కానీ ఆసుపత్రి యాజమాన్యం తమకు కనీసం మృతదేహాన్ని కూడా అప్పగించకుండా, సిబ్బంది మొత్తం బోర్డు తిప్పేసి పారిపోయారని ఒక బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రమాదం జరిగిన తర్వాత రోగులను సమీపంలోని ఇతర ఆసుపత్రులకు తరలించడంతో, తమ వారి ఆచూకీ తెలియక చాలా మంది కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లా కలెక్టర్ (DM) సుబ్రత్ కుమార్ సేన్ మాట్లాడుతూ.. మరణించిన ముగ్గురి మృతదేహాలు ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్నాయని, ప్రమాద సమయంలో అడ్మిట్ అయిన రోగులందరి వివరాలను, వారి ప్రస్తుత పరిస్థితిని తనిఖీ చేస్తున్నామని తెలిపారు. సివిల్ సర్జన్ స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని వైద్య సహాయాన్ని పర్యవేక్షిస్తున్నారు.
ఫైర్ ఆఫీసర్ ఆర్.ఎన్.పాండే తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదంపై సమాచారం అందింది. ఫైర్ ఫైటర్లు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికే ఐసీయూ మొత్తం దట్టమైన పొగతో నిండిపోయిందని, రెస్క్యూ టీమ్లు వచ్చేసరికి ఆసుపత్రి ఉద్యోగులు ఎవరూ అక్కడ లేరని ఆయన తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో 20 మందికి పైగా రోగులు గాయపడగా, వారిని అత్యవసరంగా భవనం నుంచి బయటకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘోర ప్రమాదం తర్వాత బాధితుల బంధువులు ఆసుపత్రి పరిపాలనా విభాగంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఐసీయూలో అడ్మిట్ అయిన తన తండ్రి ఈ ప్రమాదంలోనే చనిపోయాడని, కానీ ఆసుపత్రి యాజమాన్యం తమకు కనీసం మృతదేహాన్ని కూడా అప్పగించకుండా, సిబ్బంది మొత్తం బోర్డు తిప్పేసి పారిపోయారని ఒక బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రమాదం జరిగిన తర్వాత రోగులను సమీపంలోని ఇతర ఆసుపత్రులకు తరలించడంతో, తమ వారి ఆచూకీ తెలియక చాలా మంది కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లా కలెక్టర్ (DM) సుబ్రత్ కుమార్ సేన్ మాట్లాడుతూ.. మరణించిన ముగ్గురి మృతదేహాలు ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్నాయని, ప్రమాద సమయంలో అడ్మిట్ అయిన రోగులందరి వివరాలను, వారి ప్రస్తుత పరిస్థితిని తనిఖీ చేస్తున్నామని తెలిపారు. సివిల్ సర్జన్ స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని వైద్య సహాయాన్ని పర్యవేక్షిస్తున్నారు.